ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధానోపాధ్యాయునికి ఆత్మీయ వీడ్కోలు.. విద్యార్థుల కంటతడి - Krishna District Penuganchiprolu Zilla Parishad High School News

విద్యార్థులకు గురువుపై ఉన్న ప్రేమ ఎనలేనిదని నిరూపించారు... ఆ పాఠశాల స్టూడెంట్స్. తమ పాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా సేవలందించిన ఆయన కృషి ఎనలేనిదని కొనియాడారు. వీడ్కోలు కార్యక్రమంలో తమ గురువుని ఘనంగా సత్కరించి... కంటతడి పెట్టుకున్నారు. ఈ ఆత్మీయ సన్నివేశం.. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది.

ప్రధానోపాధ్యాయునికి ఆత్మీయ వీడ్కోలు.. విద్యార్థుల కంటతడి
ప్రధానోపాధ్యాయునికి ఆత్మీయ వీడ్కోలు.. విద్యార్థుల కంటతడి

By

Published : Mar 23, 2021, 10:24 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహించి బదిలీ అయిన ఆళ్ల రాంబాబును ఘనంగా సత్కరించారు.

అనంతరం విద్యార్థులు ఊరి చివర వరకు భారీ ర్యాలీ నిర్వహించి వీడ్కోలు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆయన్నే ప్రధానోపాధ్యాయులుగా ఉండాలని కంటతడి పెట్టుకున్నారు. సర్పంచి వేల్పుల పద్మ కుమారి, రవికుమార్ దంపతులు, గ్రామ పెద్దలు ర్యాలీలో పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details