కృష్ణాజిల్లా కోడూరు గ్రామానికి చెందిన మైనర్ బాలికకు వివాహం చేయబోతున్న తల్లిదండ్రులు, వరుడ్ని కోడూరు పోలీస్ స్టేషన్లో అధికారులు కౌన్సెలింగ్ చేశారు. ఎంపీయూపీ స్కూల్ కోడూరులో 8వ తరగతి చదువుతున్న బాలికను ఆర్థిక కారణాల దృష్ట్యా సుమారు 30 ఏళ్లు దాటిన దివ్యాంగుడికిచ్చి పెళ్లి చేసేందుకు బాధితురాలి తల్లి సిధ్ధమైంది.
రూ.లక్ష ఎదురు కట్నం..
ఈ క్రమంలో రూ.లక్ష ఎదురు కట్నం తీసుకుని తన కూతురిని పెళ్లి పీటలెక్కించాలనుకుంది. బాలిక తల్లి గత కొద్ది రోజులుగా చేస్తున్న యత్నాలను స్థానికులు నిశితంగా గమనించారు.