ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయింపు తగ్గిస్తూ.. క్రమంగా పథకాన్ని నిర్వీర్యం చేయటానికి కేంద్రం యత్నిస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లి విల్సన్ ఆరోపించారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్మిక సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
బడ్జెట్లో గ్రామీణ పేదలకు సంబంధించిన కేటాయింపు తగ్గించటాన్ని ఖండించారు. ఈ నెల 12వ తేదీన జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. కూలీ రేట్లు తగ్గిస్తూ ఉపాధి హామీని దెబ్బతీస్తున్నారని ఆయన విమర్శించారు.