ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కేజీ బేసిన్ వద్ద శ్రీలంక బోటు.. ఆరుగురు మత్స్యకారులు అరెస్టు

By

Published : Jul 14, 2020, 3:33 PM IST

కేజీ బేసిన్లో టూనా చేపల వేటకు వచ్చిన శ్రీలంక బోటును మెరైన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు శ్రీలంక మత్స్యకారులను అరెస్టు చేశారు.

srilanka boat found at KG basin
కేజీ బేసిన్ వద్ద శ్రీలంక బోటు

భారత జలాల్లోకి ప్రవేశించిన శ్రీలంక బోటును మచిలీపట్నం తీరంలో మెరైన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేజీ బేసిన్లో టూనా చేపల వేటకు వచ్చిన ఆరుగురు శ్రీలంక వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ బోటు భారత జలాల్లోకి ప్రవేశించిందన్న సమాచారం అందుకున్న కాకినాడ కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రియదర్శిని బోటులో వారిని వెంటాడి పట్టుకున్నారు. ఆరుగురిని కాకినాడ మెరైన్ పోలీసులకు అప్పగించారు. వీరిని క్వారంటైన్ కు పంపిస్తున్నట్లు మెరైన్ సీఐ గౌరీశంకర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details