ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 9, 2019, 12:04 AM IST

ETV Bharat / state

ఈనెల 17 నుంచి జనవరి 19 వరకు శబరిమలకు ప్రత్యేక రైళ్లు

శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ఈనెల 17 నుంచి జనవరి19 వరకు శబరిమలకు ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శబరిమలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. విశాఖపట్నం -కొల్లం-విశాఖపట్నం మధ్య 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 17 నుంచి జనవరి 19 వరకు ప్రతి ఆదివారం రాత్రి 11.50కి విశాఖపట్నం నుంచి కొల్లంకు, ప్రతి మంగళవారం ఉదయం 10గంటలకు కొల్లం నుంచి విశాఖపట్నంకు ప్రత్యేక రైళ్లు బయలు దేరతాయి. రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, ఒంగోలు , నెల్లూరు, రేణిగుంట మీదుగా ప్రత్యేక రైళ్లు ప్రయాణమవనున్నాయి. ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details