ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నా ఇంటికి ఎందుకు వచ్చారు?'.. పోలీసులపై సోము వీర్రాజు ఆగ్రహం - పోలీసులపై సోమువీర్రాజు ఆగ్రహం

భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. అపార్ట్​మెంటులో అద్దెకు ఉంటున్న తాను ఉండాలా.?. ఖాళీ‌ చేయాలా? అని ప్రశ్నించారు.

somu veeraju fires on police at his home
పోలీసులపై భాజాపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ఆగ్రహం

By

Published : Jan 21, 2021, 4:03 PM IST

పోలీసులపై భాజాపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ఆగ్రహం

భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని డీజీపీ కార్యాలయం వద్ద ధర్నాకు భాజపా పిలుపునివ్వటంతో సోమువీర్రాజు ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాగానే అడ్డుకున్నారు. తాను ఏం తప్పు చేశానని ఇంటికి పోలీసులు వచ్చారని సోము నిలదీశారు. అర్ధరాత్రి ఇష్టం వచ్చినట్లు తలుపులు కొడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'అపార్ట్​మెంట్​లో నేను అద్దెకు ఉంటున్నా. ఇంతమంది పోలీసులు వస్తే చుట్టు పక్కల వారంతా ఏమనుకుంటారు?. నేను ఇక్కడ ఉండాలా...ఇల్లు ఖాళీ‌ చేయాలా?. నేను డీజీపీ కార్యాలయం ముట్టడిస్తానని చెప్పలేదు కదా. నా ముందు పోలీసులు ఎవరూ ఉండకూడదు. మీ ప్రవర్తనా, వైఖరిని ఖండిస్తున్నా' అని ధ్వజమెత్తారు సోమువీర్రాజు.

ఇదీ చదవండి: డీజీపీ కార్యాలయ ముట్టడి యత్నం భగ్నం.. గృహనిర్బంధంలో భాజపా నేతలు

ABOUT THE AUTHOR

...view details