ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 26, 2019, 10:02 PM IST

ETV Bharat / state

పాముకాటుతో మహిళ మృతి

పాముకాటుకు గురై మహిళ మృతిచెందిన సంఘటన కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం చింతలమడ గ్రామంలో జరిగింది.

snake byte women dead at krishna district
పాముకాటుకు మహిళ మృతి....

పాముకాటుతో మహిళ మృతి

కృష్ణాజిల్లా చల్లపల్లి మండంలంలో ఓ మహిళ పాము కాటుకు గురైంది. స్థానికులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందింది. మృతురాలు చింతలమడ గ్రామానికి చెందిన సుధాని మహాలక్ష్మిగా గుర్తించారు.

ఇదీ జరిగింది...
సుధాని మహాలక్ష్మీ రోజు మాదిరిగానే... పొలానికి వెళ్లింది. కోత కోస్తుండగా వరి దుబ్బులచాటున ఉన్న పాము ఆమెను కాటేసింది. ధైర్యంతో తన చేతిలో ఉన్న కత్తితో పామును రెండు ముక్కలు చేసింది మహాలక్ష్మీ. అనంతరం స్పృహా కోల్పోయిన పడిపోయింది. తోటి కూలీలు ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యలోనే ప్రాణం విడిచింది.

ABOUT THE AUTHOR

...view details