ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యాలపై యువతకు శిక్షణ

యువతలో నైపుణ్యాలు పెంచి మంచి ఉద్యోగం సాధించేందుకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశారు. ఏపీఎస్​ఎస్​డీసీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు వీటిని నిర్వహించనున్నారు.

By

Published : Jun 4, 2019, 10:58 PM IST

యువతకు చేయూత

యువతకు చేయూత

కృష్ణా జిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీలో అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీఎస్​ఎస్​డీసీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు జరిగే శిక్షణలో విద్యార్థులకు ఇంజనీరింగ్ నైపుణ్యాలను నేర్పించనున్నారు. 210 మంది ఏపీఎస్​ఎస్​డీసీ ట్రైనీలు, 31 మంది ఆర్​జేకేయూటీ నూజివీడు విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. యువతకు ఎంతగానో ఉపయోగపడే ఈ శిక్షణ కార్యక్రమాన్ని నూజివీడు ప్రాంగణంలో ఏర్పాటు చేసినందుకు నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సూర్యచంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిక్షణా తరగతులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయని అన్నారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్యూరిటీ ఫర్ లేబర్ ఎంప్లాయిమెంట్ జేఎస్​వీ ప్రసాద్ హాజరయ్యారు. విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో సార్థకం అవ్వాలంటే ప్రతి విద్యార్థి ఆలోచనా తీరు, ప్రవర్తనలో మార్పులు రావాలని అన్నారు. ఆర్​జేకేయూటీ ప్రాంగణాల ఉపకులపతి ఆచార్య రామచంద్రరాజు, ఉన్నత విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి దమయంతి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details