ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 7, 2020, 6:00 PM IST

ETV Bharat / state

కృష్ణాజిల్లాలో రహదారులు రక్తసిక్తం... ఆరుగురు మృత్యువాత

కృష్ణా జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఆరుగురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

road accidents in Krishna district
road accidents in Krishna district

కృష్ణా జిల్లాలో సోమవారం వేర్వేరుచోట్ల జరిగిన నాలుగు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృత్యువాడ పడ్డారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. బాపులపాడు మండలం, కంచికచర్ల, విజయవాడలో అజిత్​సింగ్ నగర్, కృష్ణలంక పరిధిల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి.

  1. బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారందరూ భీమవరంలో ఓ వివాహానికి హాజరై నూజివీడు తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
  2. హైదరాబాద్-విజయవాడ రహదారిలో కంచికచర్ల వద్ద అడిషనల్ డీజీపీ కృపానంద త్రిపాఠి వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడ్ని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. త్రిపాఠికి ప్రమాదం తప్పింది.
  3. విజయవాడ అజిత్ సింగ్ నగర్​లో ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ద్విచక్ర వాహనదారుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
  4. విజయవాడ కృష్ణలంక బస్టాండు రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను లారీ ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కృష్ణలంక రణధీర్ నగర్​కు చెందిన వినోద్, శేఖర్​లుగా గుర్తించారు.

ఈ రోడ్డు ప్రమాదాలకు వేగమే ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details