ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణానది వరదలో చిక్కుకున్న గొర్రెలు, గొర్రెల కాపరులు - కృష్ణానది లో వరద లో చిక్కుకున్న గొర్రెలు, గొర్రెల కాపరులు

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పల్లెపాలెం శివారు వద్ద కృష్ణా నదిలో 10 మంది గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. వారితో పాటు 600 గొర్రెలు కూడా వరదలో చిక్కుకుపోయాయి. దిబ్బలపై చేరుకున్న కాపారులు నీటిమట్టం పెరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు

కృష్ణానది వరదలో చిక్కుకున్న గొర్రెలు
కృష్ణానది వరదలో చిక్కుకున్న గొర్రెలు

By

Published : Sep 15, 2020, 9:34 PM IST

కృష్ణా నదిలో 10 మంది గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ పల్లెపాలెం శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. వారు ఉన్న దిబ్బ మునిగిపోవటంతో మరో దిబ్బపైకి చేరుకున్నారు. మరో 4 అడుగులు వరద పెరిగితే రెండో దిబ్బ మునిగే ప్రమాదం ఉందని కాపరులు ఆందోళన చెందుతున్నారు. కాపరులతో పాటు 600 గొర్రెలు దిబ్బలపైకి చేరుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details