మార్చి ఒకటో తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు అనుమతి ఇవ్వటంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ అఖిలపక్ష భేటీకి వివిధ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించిన ఎస్ఈసీ... పార్టీల నుంచి ఒక్కో ప్రతినిధి హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని పార్టీ నేతలను కోరనున్నారు. రాజకీయపక్షాల నుంచి ఎన్నికల నిర్వహణలో సూచనలు, సలహాలను ఎస్ఈసీ స్వీకరించనున్నారు.
మున్సిపల్ ఎన్నికలపై మార్చి ఒకటిన ఎస్ఈసీ అఖిలపక్ష సమావేశం
మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వివిధ పార్టీ నేతలతో ఎస్ఈసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించారు.
మార్చి ఒకటిన అఖిలపక్ష సమావేశం