కృష్ణా జిల్లా అవనిగడ్డ డిపో నుంచి 31 బస్సుల ద్వారా మొక్కజొన్నలను రవాణా చేస్తున్నారు. లాక్డౌన్తో లారీలు అందుబాటులో లేకపోవడం, డ్రైవర్లు దొరకకపోవడం వంటి కారణాలతో సకాలంలో పంటను రవాణా చేయలేని స్థితిలో ఉన్న అన్నదాతలకు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతోంది. లారీల కన్నా తక్కువ ఛార్జీలతో బస్సులను ఏర్పాటు చేశామని అవనిగడ్డ డిపో మేనేజరు బి.కోటేశ్వర నాయక్ తెలిపారు.
ఆర్టీసీ వినూత్న ఆలోచన... బస్సుల్లో పంట ఉత్పత్తుల తరలింపు - అవనిగడ్డ నేటి వార్తలు
కృష్ణా జిల్లా అవనిగడ్డ ఆర్టీసీ డిపో అధికారులు వినూత్న ఆలోచన చేశారు. రైతులు పండించిన పంటను రవాణా చేసుకునేందుకు వాహనాల సదుపాయం లేనందున ఆర్టీసీ బస్సుల్లో తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సౌకర్యంపై అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బస్సుల్లో పంట ఉత్పత్తులు తరలింపు