ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్రవాహనం ఢీ కొని హోంగార్డు మృతి - over speed and accident

అతి వేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కృష్ణా జిల్లా జనార్దనపురంలో ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తున్న ముగ్గురు యువకులు రోడ్డుపై నిలుచున్న వ్యక్తిని బలంగా ఢీ కొట్టారు. ఈ ఘటనలో అతను అక్కడి కక్కడే మృతి చెందాడు.

road accient in krishna dst
రోడ్డుప్రమాదం

By

Published : Dec 15, 2019, 10:00 PM IST

ద్విచక్రవాహనం ఢీ కొని హోంగార్డు మృతి

కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురం గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తూ గోవర్దన్​ అనే వ్యక్తిని ఢీ కొట్టారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందగా.. ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు గోవర్దన్​ కైకలూరులో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details