ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

By

Published : Jun 26, 2020, 7:40 PM IST

కృష్ణా జిల్లా చిక్కుళ్లగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Road accident in chikkullagudem, krishna district one man death and two men injured
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

కృష్ణాజిల్లా తిరువూరు మండలం చిక్కుళ్లగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. చిక్కుళ్లగూడెం గ్రామానికి చెందిన ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను తిరువూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details