ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మహిళా దినోత్సవాలు.. ఉత్సాహంగా రెవెన్యూ ఉద్యోగులు

By

Published : Mar 9, 2021, 5:52 AM IST

విజయవాడలో రెవెన్యూ ఉద్యోగినులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉత్సహంగా నిర్వహించారు. బరంపార్క్​లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జేసీ మాధవీలత పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో నృత్యాలతో సందడి చేశారు.

revenue employees
రెవెన్యూ ఉద్యోగులు

రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు చేశారు. వీఆర్​ఏ నుంచి తహసీల్దార్ వరకు అందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బరంపార్క్​లో నిర్వహించిన మహిళా దినోత్సవంలో జేసీ మాధవీలత పాల్గొని కేక్ కట్ చేశారు. యోగాసనాల విశిష్టతను యోగా గురువు... ఉద్యోగినులకు వివరించారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంచాలని వైద్యులు సూచించారు. నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే రెవెన్యూ ఉద్యోగులు.. సెలవు దొరకటంతో సరదాగా గడిపారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనల్లో... సాంప్రదాయ, సినిమా పాటలకు ఉద్యోగినులు నృత్యాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details