ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో ఎంపీఈవోల "స్పందన దీక్ష" - mpeos darna

రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియమించిన ఎంపీఈవోలు దీక్షకు దిగారు. తమను నేరుగా గ్రామ సచివాలయంలో ఉద్యోగాలకు తీసుకోవాలని కోరుతూ దీక్ష చేపట్టారు.

జగనన్నకు ఎంపీఈవోల విజ్ఞాపనా దీక్ష....

By

Published : Jul 17, 2019, 6:58 PM IST

జగనన్నకు ఎంపీఈవోల విజ్ఞాపనా దీక్ష....

నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎంపీఈవోలను నేరుగా గ్రామ సచివాలయంలో ఉద్యోగాలకు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హార్టికల్చర్, అగ్రికల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద స్పందన దీక్షకు దిగారు. వ్యవసాయ ఉద్యాన శాఖలు 2017వ సంవత్సరంలో, ప్రభుత్వం జీవో 43 ప్రకారం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ... మౌఖిక పరీక్ష ద్వారా ప్రభుత్వం నియామకాలు చేపట్టిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. ఆర్థిక శాఖ అనుమతితో రాష్ట్ర వ్యవసాయ ఉద్యానశాఖలో 5వేల 7వందల 64 మంది ఎంపీఈవోలు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు, ఇప్పటికే పనిచేస్తున్న ఎంపీఈవోలను నేరుగా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details