ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 20, 2020, 4:07 PM IST

ETV Bharat / state

గత ప్రభుత్వం చేసిన తప్పులనే వైకాపా ప్రభుత్వం చేస్తోంది: రావెల

ఏన్డీయే ఏడాది పాలనపై కృష్ణా జిల్లా పామర్రులో నిర్వహించిన జన జాగరణ కార్యక్రమంలో భాజాపా నేత రావెల కిశోర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన తప్పులనే ప్రస్తుత వైకాపా ప్రభుత్వం కూడా చేస్తోందని విమర్శించారు.

గత ప్రభుత్వం చేసిన తప్పులనే వైకాపా ప్రభుత్వం చేస్తోంది: రావెల
గత ప్రభుత్వం చేసిన తప్పులనే వైకాపా ప్రభుత్వం చేస్తోంది: రావెల

గత ప్రభుత్వం చేసిన తప్పులనే ప్రస్తుత వైకాపా ప్రభుత్వం కూడా చేస్తోందని భాజాపా నేత రావెల కిశోర్ బాబు ఆరోపించారు. కృష్ణా జిల్లా పామర్రులో ఏన్డీయే ఏడాది పాలనపై జన జాగరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలతో కలిసి ఆయన కరపత్రాన్ని విడుదల చేశారు.

ఏడాది కాలంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.45 వేల కోట్లు విడుదలయ్యాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తన సొంత పేరు పెట్టుకొని పథకాలు అమలు చేయటం శోచనీయమన్నారు.

ABOUT THE AUTHOR

...view details