రాజధాని అంగుళం కూడా కదలదని భాజపా రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి స్పష్టం చేశారు. అమరావతి రైతుల ఉద్యమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా.. రైతులు, జేఏసీ నేతలకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని భాజపా తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదు: సుజనా చౌదరి - amaravathi news updates
అమరావతి రైతుల ఆందోళనలు 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందించారు. రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదని స్పష్టం చేశారు.
![రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదు: సుజనా చౌదరి Rajyasabha member sujana choudari said The capital does not move even an inch in vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7890637-515-7890637-1593860024362.jpg)
అమరావతి రైతులనుద్దేశించి మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి