ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రామాలయాల్లో భాజపా, వీహెచ్​పీ​ ప్రత్యేక పూజలు - bjp leaders prayers to lord rama in krishna district

కృష్ణా జిల్లాలో భాజపా, విశ్వహిందూ పరిషత్​ నాయకులు రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. అయోధ్య రామ జన్మభూమిలో శ్రీరాముని దివ్య మందిర నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తి కావాలని హిందూ సోదరులు కోరుకున్నారు.

prayers in ramalayam temples in krishna district on occasion of stone laid foundation in ayodhya
కృష్ణా జిల్లాలో ప్రత్యేక పూజలు

By

Published : Aug 5, 2020, 10:45 PM IST

విజయవాడలో..

అయోధ్యలో రామ మందిరం భూమి పూజ కార్యక్రమం సందర్భంగా విజయవాడ మహానగర్ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. విశ్వహిందూ పరిషత్​ కేంద్రీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, ప్రాంతీయ ధర్మ ప్రచార సంరక్షకులు తోండేపు హనుమంతరావు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

భాజపా కార్యాలయాలంలో పార్టీ శ్రేణులు సంబరాలు జరిపారు. పెద్ద ఎత్తున టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. భాజపా యువమోర్చా అధ్యక్షులు రమేష్‌నాయుడు, పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాముడు పుట్టిన నేలలోనే ఎన్నో ఏళ్ల తర్వాత రామమందిరం నిర్మాణం జరగటం చాలా సంతోషకరమన్నారు.

జగ్గయ్యపేటలో..

అయోధ్యలో రామాలయానికి భూమి పూజ జరిగిన నేపథ్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలలో భక్తులు శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేసి భజన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాజపా, ఆర్​ఎస్​ఎస్​, విశ్వహిందూ పరిషత్​ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రముఖ ఆలయంగా విరాజిల్లుతున్న పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవాలయంలో శ్రీ సీతారామ, ఆంజనేయ విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.

ఇదీ చదవండి :

విశాఖ జిల్లాలో శ్రీరామునికి ప్రత్యేక పూజలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details