ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజకీయం అంటే ప్యాలస్​లలో కూర్చోవడం కాదు : శైలజనాథ్ - Cm jagan in vijayawada

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గాల్ని ఎండగట్టేందుకు దేశవ్యాప్త నిరసనలో భాగంగా విజయవాడలో కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. రాజకీయం అంటే ప్యాలస్​లలో కూర్చోవడం కాదని సీఎం జగన్​ను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.

రాజకీయం అంటే ప్యాలస్​లలో కూర్చోవడం కాదు : శైలజనాథ్
రాజకీయం అంటే ప్యాలస్​లలో కూర్చోవడం కాదు : శైలజనాథ్

By

Published : Nov 5, 2020, 11:02 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనీసం రాజకీయం చేయడం వచ్చా అని ఏపీసీసీ అధ్యక్షుడు శైలాజానాథ్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, పేదలు, మహిళలపై జరుగుతున్న దాడులు, అకృత్యాలపై ప్రభుత్వాల దుర్మార్గాల్ని ఎండగట్టేందుకే దేశవ్యాప్త నిరసనలో భాగంగా విజయవాడలో దర్నా చేపట్టామని శైలజానాథ్ అన్నారు.

దీటుగా ఎదుర్కొంటాం..

హత్యలు, దాడులను దీటుగా ఎదుర్కొంటామని.. ప్రజల వద్దకే నేరుగా వెళ్లి ప్రభుత్వాల దుర్మార్గాల్ని వివరిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలకే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని.. ఇక సామాన్యులను కలిసే అవకాశం ఏమిస్తారని ఎద్దేవా చేశారు.

మాట్లడితే అక్రమ కేసులు..

ఏదైనా దుర్మార్గాల్ని ఎదిరించి ‌మాట్లాడితే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని చెబుతున్నారని.. కాని కొట్టించిన వాళ్లని అరెస్ట్ చేశారా లేదా అని ఏపీసీసీ తరఫున ప్రశ్నిస్తున్నామన్నారు.

ఇవీ చూడండి : ఏపీ ఈసెట్​ 2020: వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ABOUT THE AUTHOR

...view details