ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో పోలీసులు, జనసైనికుల మధ్య తోపులాట - విజయవాడ జనసేన తాజా వార్తలు

దేవాలయాలపై దాడులకు నిరసనగా విజయవాడలో శాంతియుత ర్యాలీ చేపట్టిన జనసేన కార్యకర్తలను, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారికి, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

police stopped janasena rally in vijayawada
పోలీసులు, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట

By

Published : Sep 19, 2020, 3:16 PM IST

హిందూ దేవాలయాలపై దాడులు, విజయవాడ దుర్గ గుడి రథంలోని వెండి సింహాల మాయం ఘటనలకు బాధ్యత వహిస్తూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు రాజీనామా చేయాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేశ్ అన్నారు. ఈ డిమాండ్​తో విజయవాడ వన్​టౌన్​లో ఆందోళన చేపట్టారు. శాంతియుత ర్యాలీ చేపట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.

ABOUT THE AUTHOR

...view details