ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొవిడ్​తో యువతి మృతి..అంతిమ సంస్కారాలు చేపట్టిన పోలీసులు

By

Published : Apr 17, 2021, 7:58 PM IST

కొవిడ్​తో మృతి చెందిన ఓ యువతికి పోలీసులే అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. కృష్ణాజిల్లా నాగాయలంక మండలం రేమాలవారిపాలెం శివారు పేర్లవానిలంక గ్రామంలో ఈ ఘటన జరిగింది.

funeral for covid death women
కొవిడ్​ మృతురాలి అంతిమ సంస్కారాలు

కృష్ణా జిల్లా పేర్లవానిలంక గ్రామంలో కరోనాతో మృతి చెందిన ఓ యువతికి.. అవనిగడ్డ సీఐ బి. భీమేశ్వర్ రవికుమార్, నాగాయలంక ఎస్ఐ కుడిపూడి శ్రీనివాసు.. ఇతర పోలీస్​సిబ్బంది కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. నాగాయలంకలో ఇస్త్రీ బండితో జీవనం సాగిస్తూ ఓ వ్యక్తి సోదరి కొవిడ్​తో మరణించింది. ఆమె అంత్యక్రియలకు బంధువులెవరూ ముందుకు రాకపోవటంతో.. పోలీస్ ​సిబ్బంది, ఇతర సామాజిక కార్యకర్తలు నిర్వహించారు. అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు శ్మశానవాటికకు చేరుకుని మానవతావాదుల సేవానిరతిని అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details