ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 17, 2020, 4:55 PM IST

ETV Bharat / state

తిరువూరులో పోలీసుల కార్డన్ సెర్చ్

కృష్ణా జిల్లా తిరువూరులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోని ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా జల్లెడ పట్టారు. నేరచరిత్ర, అనుమానాస్పద వ్యక్తుల నుంచి వేలిముద్రలు సేకరించారు. రికార్డులు సరిగా లేని 30 ద్విచక్ర వాహనాలను స్టేషన్​కు తరలించారు.

police Carden Searches At Tiruvuru
తిరువూరులో పోలీసులు కార్డన్ సెర్చ్

తిరువూరులో పోలీసులు కార్డన్ సెర్చ్

కృష్ణా జిల్లా తిరువూరులోని సమస్యాత్మక ప్రాంతమైన తంగేళ్లబీడులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాలతో నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం నలుగురు సర్కిల్ ఇన్​స్పెక్టర్​లు, 18 మంది ఎస్సైలు 200 సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details