ఎన్ఎంసీ బిల్లుపై ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ను డీసీపీ కాలర్ పట్టుకుని చెంపపై కొట్టాల్సిన అవసరం ఏంటనీ తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం ఎవరు ఆందోళన చేపట్టినా.. వైకాపా ప్రభుత్వం అసహనానికి గురవుతోందని మండిపడ్డారు. 'ఇదేనా రాజన్నరాజ్యం'... ప్రజల గొంతునొక్కే ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జూనియర్ డాక్టర్ను డీసీపీ కాలర్ పట్టుకుని చెంపపై కొట్టిన దృశ్యాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
'వైకాపా ప్రభుత్వానికి.. ఎందుకంత అసహనం' - police attack
సమస్యల పరిష్కారం కోసం ఎవరు ఆందోళనలు చేపట్టినా.. వైకాపా ప్రభుత్వం అసహనానికి గురవుతోందని తెదేపా అధినేత మండిపడ్డారు.

'వైకాపా ప్రభుత్వానికి.. ఎందుకంత అసహనం'
Last Updated : Aug 7, 2019, 8:55 PM IST