ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎనిమిది నెలల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం - police arrest kidnapers at jaipur

అప్పు తీర్చలేదని బాలుణ్ని ఎత్తుకెళ్లిన వారిని జైపూర్​లో పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో  కథ సుఖాంతమైంది.

కిడ్నాప్ కథ సుఖాంతం

By

Published : Sep 20, 2019, 10:15 AM IST

చేసిన అప్పు తీర్చలేదని బాలుణ్ని ఎత్తుకెళ్లిన వ్యక్తులను పోలీసులు జైపూర్​లో అదుపులోకి తీసుకొని, బాలుడిని విజయవాడకు తీసుకొస్తున్నారు. జైపూర్​ నుంచి వలస వచ్చి విజయవాడలో నివాసం ఉంటున్న సోను దంపతులకు ఎనిమిది నెలల బాలుడు ఉన్నాడు. సోను, జైపూర్​కు చెందిన చాను దంపతుల నుంచి 36 వేల నగదు అప్పుగా తీసుకొని చెల్లించలేదు. ఈ క్రమంలో గొడవ కూడా జరిగింది. ఆవేశంతో చాను ఈ నెల 17న విజయవాడ వచ్చి బాలుడిని జైపూర్​కు ఎత్తుకెళ్లిపోయారు. బాధితులు వెంటనే ఆత్కూరు పోలీసు స్టేషన్​ను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు హుటాహుటిన జైపూర్​ వెళ్లారు. సెల్​ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందింతులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ కిడ్నాపర్ల కంటే ముందే జైపూర్​ చేరుకున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మన్నార్ గుడి ఎక్స్​ప్రెస్​లో జైపూర్​కు బయల్దేరిన నిందితులను ట్రాన్స్​పోర్ట్ నగర్​ అదుపులోకి తీసుకున్నారు. అంతా కలిసి రైలులో విజయవాడ వస్తున్నారు. కిడ్నాప్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేవలం 40 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ ద్వారకా తిరుమలరావు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details