ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంతుచిక్కని వ్యాధితో సతమతం.. ఊరంతా కన్నీళ్లమయం..!

By

Published : Nov 13, 2022, 12:34 PM IST

People Suffering from Kidney Disease: అదో మారుమూల పల్లెటూరు. అక్కడి వారికి స్వచ్ఛమైన తాగునీరు లేదు. ఫ్లోరైడ్‌ నీరే దిక్కు. మెరుగైన వైద్య సేవలూ అందనిద్రాక్షే. పట్టించుకునే నాథుడులేడు. యంత్రాంగం ఉదాసీన వైఖరి, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వెరసి.. కిడ్నీ వ్యాధి వారి ప్రాణాలను హరించివేస్తోంది. ఖరీదైన వైద్యం చేయించునే స్థోమత లేక... ఆదుకునే నాథుడు లేక మృత్యువాత పడుతున్నారు. తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలోని ఓ పల్లేవాసులు ఆవేదన ఇది.

అంతుచిక్కని వ్యాధితో సతమతం
అంతుచిక్కని వ్యాధితో సతమతం

People Suffering from Kidney Disease: మాయదారి కిడ్నీ రోగం ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్ తండా ప్రజలను కబళించేస్తోంది. ఉన్నంతలో వ్యవసాయం చేసుకుంటూ పిల్లాపాపలతో ఆనందంగా గడిపే, ఆ పల్లెటూరి జనాన్ని అంతుచిక్కని వ్యాధి పట్టిపీడిస్తోంది. ఏ గడపను కదలించినా కన్నీటి గాథలే. ఇంటి పెద్దదిక్కు కోల్పోయి కొందరు.. ఎదిగిన కొడుకు నేలరాలి మరికొందరు జీవచ్ఛవంలా బతుకులీడుస్తున్నారు.

మూత్రపిండాల వ్యాధి బారిన పడి మచ్చాపూర్ తండా తల్లిడిల్లుతోంది. ఈ తండాలో 56 కుటుంబాలుండగా 285 మంది జనాభా నివసిస్తున్నారు. మూడేళ్లలో మూత్రపిండాల వ్యాధితో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఇటీవల ఐసీఎమ్​ఆర్ వైద్యశిబిరంలో పరీక్షలు చేయగా, మరో 13 మంది అదే సమస్యతో బాధపడుతున్నట్లు నివేదికలు వచ్చాయి.

మాయదారి రోగం నయం చేసుకునేందుకు సమీప పట్టణాల్లోని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఇల్లు, ఒల్లు గుల్ల చేసుకుంటున్న దయనీయ పరిస్థితి. బతుకునిచ్చే భూములను తెగనమ్ముకున్ని దవాఖానాల్లో చూపించుకుంటున్నారు. పెద్దదిక్కు కోల్పోయి పుట్టెడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మూత్రపిండాల వ్యాధి శాశ్వతంగా పారదోలేందుకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని వేడుకుంటున్నారు. మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీ కావడం వల్ల శుద్ధజలాలు అందడం లేదని వాపోతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details