కృష్ణా జిల్లా కంచికచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వ్యాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరారు. వ్యాక్సిన్ కోసం కొద్దిపాటి తోపులాట జరిగింది. పోలీసులు ప్రజలను క్యూ లైన్లో ఉంచి వ్యాక్సిన్ వేయిస్తున్నారు. వీరులపాడు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరారు.
నందిగామలో...
నందిగామ వార్డు సచివాలయంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం ఏడు గంటల నుంచే పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. రిజిస్ట్రేషన్ చేసి టీకా వేసేందుకు స్లిప్పులు అందజేశారు. కొవాగ్జిన్ రాలేదని కేవలం కొన్ని కొవిషీల్డ్ టీకాలు మాత్రమే వేస్తామని చెప్పటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిషీల్డ్ రెండో డోస్ వారికే ఇప్పుడు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం నుంచి టీకాలకోసం నిరీక్షించినా లేదని చెప్పటం పై అక్కడి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలో..