ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డోకిపర్రు ఆలయానికి రావటం ఎంతో ఆనందం: పవన్ - డోకిపర్రు వెంకటేశ్వరస్వామి ఆలయం వార్తలు

కృష్ణా జిల్లాలో అధ్యాత్మిక క్షేత్రంగా పేరొందిన డోకిపర్రు ఆలయానికి రావటం ఎంతో ఆనందంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.

Pawankalyan_Temple
Pawankalyan_Temple

By

Published : Dec 12, 2020, 5:41 PM IST

కృష్ణా జిల్లా డోకిపర్రు శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం భవిష్యత్తులో మరింత ప్రసిద్ధి చెందాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు..మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఎండీ పి.వి కృష్ణారెడ్డి, ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్ పిచ్చిరెడ్డి స్వాగతం పలికారు.

బ్రహ్మోత్సవాలలో కళ్యాణోత్సవానికి రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పవన్ అన్నారు. నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. మేఘా ఇంజినీరింగ్ సంస్థ వారు సీఎస్ఆర్ కింద గ్రామంలో సమకూర్చిన సౌకర్యాలపై పవన్ హర్షం వ్యక్తం చేశారు. నిరంతర గ్యాస్ సరఫరా ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. పూజలు చేసిన అనంతరం..వేద పండితులు పవన్​కు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details