ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 17, 2021, 9:50 AM IST

ETV Bharat / state

నాలుగో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో.. ఏకగ్రీవాలు

నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు.. పలు చోట్ల ఏకగ్రీవమయ్యాయి. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం, నెల్లూరు డివిజన్ పరిధిలో ఏకగ్రీవాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

unanimous panchayati elecitons
ఏకగ్రీవాలు

నూజివీడులో..

కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో.. నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు కొన్ని చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయి. నూజివీడు మండలం దేవరగుంట, చాట్రాయి మండలంలోని కోటపాడు, బూరుగుగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్​లు ఏకగ్రీవమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ మూడు గ్రామాల్లోనూ వైకాపా మద్దతుదారులే ఏకగ్రీవమైనట్లు తెలిపారు.

నియోజకవర్గ పరిధిలో 80 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఆగిరిపల్లి మండలం నుంచి 52 మంది సర్పంచ్ అభ్యర్థులు, 446 మంది వార్డు సభ్యులు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నూజివీడు మండలలో 62 మంది సర్పంచ్​ అభ్యర్థులు, 500 మంది వార్డు సభ్యులు ఎన్నికల రేసులో ఉన్నారు. ముసునూరు మండలంలో 42 మంది సర్పంచ్ అభ్యర్ధులు కాగా, 368 మంది వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. చాట్రాయి మండలంలో 40 మంది సర్పంచ్ అభ్యర్థులు కాగా, 317 మంది వార్డు సభ్యులు పోటీలో నిలిచారు.

నెల్లూరులో...

నెల్లూరు డివిజన్ పరిధిలో నాలుగో విడత స్థానిక ఎన్నికలకు.. 12 మండలాల్లో 236 సర్పంచ్ స్థానాలకు 55 ఏకగ్రీవమయ్యాయి. 181 స్థానాల్లో ఎన్నికలు జరగనుండగా.. 3801 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2338 వార్డు మెంబర్ స్థానాలకు..761 స్థానాలు ఏకగ్రీవం కాగా 1576 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 21న డివిజన్​లో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి:రాష్ట్రంలో ప్రశాంతంగా మూడో దశ పల్లె పోలింగ్

ABOUT THE AUTHOR

...view details