ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రపతి భవన్‌కు పాదయాత్ర

రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రపతి భవన్ కు పాదయాత్రగా వెళ్లి కోవింద్ ను కలవనున్నారు.

By

Published : Feb 11, 2019, 8:41 PM IST

రాష్ట్రపతి భవన్‌కు పాదయాత్ర

రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు... తగిన న్యాయం చేసేలా మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయనున్నారు. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా సూచించాలని రామ్‌నాథ్‌ కోవింద్‌ను కోరనున్నారు. 11 మందితో కూడిన చంద్రబాబు బృందం ఆంధ్రభవన్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు పాదయాత్రగా వెళ్లి రేపు రాష్ట్రపతిని కలవనున్నారు. భారీ సంఖ్యలో వెళ్లాలని ముందుగా యోచించినా... కేవలం 11మందితో కూడిన బృందానికే రాష్ట్రపతి భవన్‌ అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని ధర్మపోరాట దీక్షా స్థలం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details