ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందిగామ​లో ఆపరేషన్ ముస్కాన్...23 మంది బాలలకు విముక్తి

అపరేషన్ ముస్కాన్​లో భాగంగా నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలో 23 మంది బాలకార్మికులను పోలీసులు గుర్తించారు. వీరికి నందిగామ డీఎస్పీ రమణమూర్తి కౌన్సిలింగ్ ఇచ్చారు.

By

Published : Nov 2, 2020, 5:11 PM IST

విద్యార్థులతో మాట్లాడుతున్న డిఎస్పీ
విద్యార్థులతో మాట్లాడుతున్న డిఎస్పీ


కృష్ణాజిల్లా నందిగామ సబ్​డివిజన్ పరిధిలో అపరేషన్ ముస్కాన్​లో భాగంగా నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలలో 23 మంది బాలకార్మికులను పోలీసులు గుర్తించారు. వీరికి నందిగామ డీఎస్పీ రమణమూర్తి కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు. 14 సంవత్సరాలలోపు పిల్లలను పనులకు పంపించడం నేరమని తెలిపారు.

పోలీస్​శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి చదువు బాధ్యతను తామే చూస్తామని డీఎస్పీ వెల్లడించారు. తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ గ్రామీణ, జగ్గయ్యపేట సీఐలు సతీశ్, చంద్రశేఖర్ ఎస్సైలు రామకృష్ణ, ఏసోబు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

'బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి'

ABOUT THE AUTHOR

...view details