ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉలి'క్కిపడుతున్న జనం - కడప,కర్నూలు,కృష్ణాజిల్లాలో ఉల్లితో ప్రజలు కష్టాలు

సామాన్యుడి గంజిలోకి ఉల్లి భారం కావడంతో సబ్సిడీపై రైతు బజారులో అందించే ఉల్లి కోసం ప్రజలు బారులు తీరారు. ఒక్క రేషన్ కార్డుకు కేజీ చొప్పున సబ్సిడీ ఉల్లిని 25 రూపాయలకు అందించారు. కేజీ మాత్రమే ఉల్లిపాయలు అందించడంతో ప్రజలు నిరుత్సాహ పడుతున్నారు

'ఉలి'క్కిపడుతున్న జనం
'ఉలి'క్కిపడుతున్న జనం

By

Published : Dec 13, 2019, 12:47 PM IST

రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ యార్డుల ద్వారా ఉల్లి పంపిణీ జరుగుతోంది. రెండు రోజులుగా ఆయా ప్రాంతాలకు అధికారులు ఉల్లిపాయలను చేర్పించి మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉంచారు. ఉల్లి పంపిణీలో అధికారులు నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉల్లిపాయల కోసం వచ్చే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తీసుకురావాలని ఒక్కో కార్డుకు ఒక కిలో ఉల్లిని పంపిణీ చేస్తామని మార్కెటింగ్ అధికారులు పేర్కొంటున్నారు. కిలో ఉల్లి ధర రూ 25 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
కనీసం రేషన్ కార్డుకు మూడు కేజీలు ఉల్లిపాయలు అందించి సామాన్యుని చేతికి సబ్సిడీ ఉల్లి చేరేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు,కడప,కృష్ణా,గుంటూరు జిల్లాల్లో భారీగా ఉల్లి కోసం బారులు తీరడంతో పోలీస్ బందోబస్తు మధ్య ఉల్లిపాయలు పంపిణీ చేస్తున్నారు

'ఉలి'క్కిపడుతున్న జనం

For All Latest Updates

TAGGED:

uuli barulu

ABOUT THE AUTHOR

...view details