రాష్ట్రంలో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్నిచోట్లా ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. మహారాష్ట్ర నుంచి కూడా ఉల్లి దిగుమతి అంతంతమాత్రంగా ఉండటంతో ధరలకు రెక్కలొచ్చాయి. రాష్ట్రంలో ఉల్లి పండే కర్నూలు జిల్లాపైనా వర్షాల ప్రభావం ఉండటంతో ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు తెలుపుతున్నారు. ఉల్లి దిగుబడి తగ్గిపోవడం వల్ల.. ఉన్న కొద్దిపాటి సరుకును దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు ధరలు పెంచుకుంటూ పోతున్నారు.
విజయవాడ రైతు బజార్లో కేజీ ఉల్లి రూ. 65 మేర ధర నిర్ణయించినప్పటికీ ఎక్కడా ఉల్లి లభించట్లేదు. వర్షాల కారణంగా ఉన్న కొద్దిపాటి స్టాక్ కూడా దెబ్బతింటుందనే భయంతో విక్రయదారులు అందుబాటులో ఉంచట్లేదు. ఇక దుకాణాలలో ఆ ధర.. పాయ నాణ్యతను బట్టి 70 రూపాయల నుంచి 90 రూపాయల వరకూ పలుకుతోంది.
గుంటూరు జిల్లా పెనుమాకలో పండే ఉల్లి పంటపైనా వర్షాలు, రాజధాని ప్రభావం పడటంతో అక్కడి రైతులెవ్వరూ పంట వేసేందుకు మొగ్గు చూపట్లేదు. ఎకరాకు 100కేజీలైనా పంట వస్తుందనే అశతో చొరవ చూపితే... 15 కేజీలు కూడా దిగుబడి రావట్లేదని రైతులు వాపోతున్నారు.
తగ్గిన దిగుమతి...