కృష్ణా జిల్లా నందిగామ డీఎస్పీ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారిపై.. జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కారును ఓ లారీ ఢీ కొట్టటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తాటి శ్రీను అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.