కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తన కుమారుడిని అడ్డుపెట్టుకొని భూమిని కాజేయాలని చూస్తున్నాడని పెనమత్స గ్రామానికి చెందిన మల్లేశ్వరి రాణి అనే వృద్ధురాలు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని పోలీసుల వద్దకు వెళ్లినా...పట్టించుకోవటం లేదని మీడియా ముందుకు వచ్చారు.
ప్రశ్నిస్తే దాడి..
తనకున్న ఎకరం పొలంలో పండిన పంటను ఎమ్మెల్యే అండదండలతో తన కుమారుడు చంద్రశేఖర్ రావు దౌర్జన్యంగా దోచుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే కొడుకు, కోడలు కలిసి తనపై దాడికి ప్రయత్నిస్తున్నారని వాపోయారు.