కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వెలువోలు బీసీ కాలనీకి చెందిన వృద్ద దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వేములమడ కృష్ణమూర్తి, లంకమ్మ దంపతులు గత ఎనిమిది సంవత్సరాలుగా వయోభారంతో బాధపడుతున్నారు. వీరికి సంతానం లేకపోవటంతో బంధువులు ఆసరాగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యాయత్నం చేశారు. సమాచారం అందుకున్న బంధువులు మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు.
వెలువోలులో విషాదం... మనస్తాపంతో వృద్ధ దంపతుల ఆత్మహత్య - కృష్ణా జిల్లా నేటి వార్తలు
కృష్ణా జిల్లా వెలువోలు బీసీ కాలనీలో విషాదం నెలకొంది. వయోభారంతో వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
![వెలువోలులో విషాదం... మనస్తాపంతో వృద్ధ దంపతుల ఆత్మహత్య old couple suicide with mentally desoppoint in veluvolu krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9290338-1051-9290338-1603472723428.jpg)
మనస్తాపంతో వృద్ధ దంపతుల ఆత్మహత్య