ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 16, 2020, 10:14 AM IST

ETV Bharat / state

భారత్​ కథనానికి స్పందన... టమాటా రేట్లపై అధికారుల ఆరా

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం, కోసూరువారిపాలెం రైతులు కృష్ణానదిలో టమాటాలు పారబోయడంపై అధికారులు స్పందించారు. మార్కెటింగ్​ శాఖ అధికారులు గ్రమస్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి టమాటాను మార్కెట్​లోకి అనుమతించమని హామీ ఇచ్చారు.

officials on tomato rates
కోసూరువారిపాలెం టమాటా రైతులతో అధికారుల భేటీ

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం, కోసూరువారిపాలెం గ్రామంలో టమాటాలు కొనేవారు లేక.. పారబోయడంపై ఈటీవీ భారత్​ కథనానికి స్పందన లభించింది. మార్కెటింగ్​ శాఖ ఉన్నతాధికారులు స్పందించి.. ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు, కేజీ ధర ఎంత పలుకుతుందనే వివరాలు ఇవ్వమని నివేదిక ఇవ్వమని అగ్రికల్చర్ మార్కెట్ కమిటి అవనిగడ్డ కార్యదర్శి కె. ఆనంద్​ను సూచించారు. ఎంత మొత్తంలో మార్కెటింగ్​ కోసం వెళ్తుందనే వివరాలు, ఏ పట్టణాలకు తీసుకువెళ్తున్నారనే...పూర్తి వివరాలతో నివేదక ఇవ్వమని ఆదేశించారు.

అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అవనిగడ్డ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు గ్రామంలో సమావేశం ఏర్పాటుచేసి రైతులతో మాట్లాడారు. బయట ప్రాంతాల నుంచి టమాటా దిగుమతి కావడంతో.. ఈ ప్రాంతం టమాటాలపై మొగ్గుచూపడంలో లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. రైతులు నష్ట పోకుండా వెంటనే తగుచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోల్డు స్టోరేజ్​ల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు.

కోసూరువారిపాలెం టమాటా రైతులతో అధికారుల భేటీ

ఇదీ చదవండి :కొనేవాళ్లు లేక టమాటా గంగపాలు

ABOUT THE AUTHOR

...view details