ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మద్యం దుకాణం తెరవొద్దంటూ మహిళల ఆందోళన

By

Published : May 4, 2020, 6:20 PM IST

లాక్​డౌన్​ సడలింపుల తర్వాత తిరిగి ప్రభుత్వ ఆదేశాలతో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఇన్నాళ్లూ కుటుంబాలతో గడిపిన మందుబాబులు ఇప్పుడు మద్యం దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలను తెరవొద్దంటూ మహిళలు డిమాండ్​ చేస్తున్నారు.

మద్యం దుకాణం తెరవొద్దంటూ మహిళల ఆందోళన
మద్యం దుకాణం తెరవొద్దంటూ మహిళల ఆందోళన

ప్రభుత్వ ఆదేశాలతో తిరిగి మద్యం దుకాణాలు తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలను నిలిపివేయాలంటూ మహిళలు అడ్డుకుంటున్నారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామంలో ఉన్నా ప్రభుత్వ మద్యం దుకాణాన్ని తెరిచేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా స్థానిక మహిళలు అడ్డుకున్నారు.

దుకాణం తెరవడానికి వీల్లేదంటూ డిమాండ్​ చేశారు. చుట్టు పక్కల గ్రామాల వారు ఇక్కడకు వస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసులు మద్యం దుకాణాన్ని మూసివేశారు.

ABOUT THE AUTHOR

...view details