ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ వర్థంతి

కృష్ణా జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం వ్యవస్థాపకుడు... ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు చోట్ల రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

By

Published : Jan 18, 2021, 3:35 PM IST

ntr death anniversary
కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ వర్థంతి నివాళులు

ఎన్టీఆర్ 25వ వర్థంతి సందర్భంగా విజయవాడ గొల్లపూడిలో.. మాజీ మంత్రి దేవినేని ఉమా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని 99 మంది తెదేపా కార్యకర్తలతో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు నూతన వస్త్రాలను అందించి.. ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఎంతో మందికి ఆదర్శప్రాయుడని అన్నారు. పరిపాలనలో మచ్చలేని నాయకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారన్నారు.

అవనిగడ్డలో..

కృష్మా జిల్లా అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెదేపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మోపిదేవిలో రక్తదానం..

ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా మోపిదేవి మండలంలో కొల్లి మురళి ఆధ్వర్యంలో.. ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగాయలంకలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

పెనమలూరులో..

తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా.. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో నివాళులర్పించారు. కంకిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి.. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెదేపా అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details