ప్రతి రైతుకు ఏటా రూ. 12,500 ఇస్తానని చెప్పిన సీఎం జగన్.. రూ. 7,500 ఇచ్చి సరిపెట్టారని తెదేపా నేత నిమ్మల రామానాయుడు అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం వల్ల ఏటా రూ. 5 వేలచొప్పున, 5 ఏళ్లలో ప్రతి రైతు రూ. 25 వేలు నష్టపోతున్నారని తెలిపారు. వైకాపా కార్యకర్తలైన వాలంటీర్ల కడుపునింపుతున్న ప్రభుత్వం.. రైతుల పొట్ట కొడుతోందని ఆరోపించారు.
64 లక్షల మంది రైతులకు రైతుభరోసా వర్తింపచేస్తామన్నజగన్ ప్రభుత్వం.. ఆ సంఖ్యను 40 లక్షలకు కుదించిందని నిమ్మల మండిపడ్డారు. 15 లక్షల మంది కౌలు రైతులకు రైతుభరోసా వర్తింపచేస్తామన్న ప్రభుత్వం.. కేవలం లక్షా 60వేల మందికి మాత్రమే వర్తించేలా పథకాన్ని కుదించారని విమర్శించారు.