ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటికుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

ఆటకని వెళ్లి నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా నంది వడ్డేమాన్​లో విషాదం నింపింది. తమ పిల్లలు ఇక లేరన్న నిజాన్ని తెలుసుకున్న బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరితో పాటు మరో చిన్నారి చనిపోవడం వల్ల గ్రామస్థులు శోక సంద్రంలో మునిగిపోయారు.

By

Published : Jun 6, 2019, 3:11 AM IST

నాగర్ కర్నూలు

నీటికుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన చిన్నారులు అనిల్​ కుమార్​, స్వాతి అనే ఈతకని వెళ్లి నీటికుంటలో పడి మృతి చెందారు. వీరితో పాటు శైలజ అనే మరో చిన్నారి కూడా చనిపోయింది. గణేష్​ అనే చిన్నారిని స్థానికులు గుర్తించి కాపాడి... నాగర్​కర్నూల్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పిల్లల మృతితో గ్రామమంతా శోక సంద్రంలో మునిగిపోయింది.

ABOUT THE AUTHOR

...view details