తెలంగాణలో రాత్రి పూట విధించిన కర్ఫ్యూను మరో వారం పొడిగించారు. మే 8 ఉదయం 5 వరకు పొడిగింపు అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.
మరో వారం వరకు..
ఏప్రిల్ 20 రాత్రి 9 గంటల నుంచి 30 తేదీ ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు పదిరోజుల క్రితం ప్రకటించిన సర్కార్.. తాజాగా నిడివిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
వాటికి మినహాయింపు..
కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, ఫార్మసీలు, ల్యాబ్లకు మినహాయింపు ఇచ్చింది. నేటితో కర్ఫ్యూ గడువు ముగియనున్నందున హైకోర్టు ఆదేశాల మేరకు మరో వారం రోజుల పాటు రాత్రి కర్ఫ్యూను పొడిగించింది.
ఇవీ చూడండి :కరోనా సమయంలో పరీక్షలు పెట్టడమేంటి?: హైకోర్టు న్యాయవాది