ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపు గవర్నర్​ ప్రమాణ స్వీకారం..ముస్తాబవుతున్న రాజ్​భవన్ - bishwabhushan harichandan

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్​గా నియమించిన బిశ్వభూషన్ హరిచందన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా, ఆ తర్వాత తాత్కాలిక హైకోర్టుగా ఉన్న భవనం నూతన హంగులతో రాజ్​భవన్​గా రూపుదిద్దుకుంటోంది.

ముస్తాబవుతున్న రాజ్​భవన్

By

Published : Jul 23, 2019, 3:30 PM IST

ముస్తాబవుతున్న రాజ్​భవన్

నూతన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అధికారిక నివాసమైన రాజ్​భవన్ శరవేగంగా ముస్తాబవుతోంది. గతంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా, ఆ తర్వాత తాత్కాలిక హైకోర్టుగా ఉన్న భవనాన్ని... రాజ్​భవన్​గా తీర్చిదిద్దుతున్నారు. గవర్నర్ నివాసంలో ఉండాల్సిన వస్తువులు, ఇతర మౌలిక సదుపాయలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గవర్నర్ వ్యక్తిగత సిబ్బందికి అవసరమైన వసతి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ భవనానికి కలంకారీ హంగులు అద్దాలని.. సంబంధిత అధికారులకు ప్రభుత్వం సూచించింది. రాజ్​భవన్ పనులను గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. రాజ్​భవన్​లో జాతీయ పతాక స్థూపాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర గవర్నర్​గా బిశ్వభూషణ్ హరిచందన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో... త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details