ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాయలసీమ ఎత్తిపోతల టెండర్లకు ఎన్జీటీ అనుమతులు

By

Published : Jul 14, 2020, 12:51 AM IST

Updated : Jul 14, 2020, 9:34 AM IST

జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై జోనల్ బెంచ్ రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిపాలనా అంశాలపై టెండర్లకు అవకాశం కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది. మరోవైపు ఈ ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు ఏమి లేదని, కేవలం రాయలసీమ జిల్లాల్లో తాగునీటి అవసరాలు తీర్చేందుకే చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది.

national-green-tribunal
national-green-tribunal

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల టెండర్లు, పాలనాపరమైన కార్యకలాపాలు చేపట్టేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. తుది తీర్పు వెలువడే వరకు క్షేత్ర స్థాయిలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని ఆదేశించింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమా.. కాదా అనే విషయాన్ని కేంద్ర పర్యావరణశాఖ పరిశీలించి తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు చెన్నైలోని ఎన్‌జీటీ జోనల్‌ బెంచి సోమవారం వివరణ ఇచ్చింది. మే 20న ఈ పథకం పనులు ఆపేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవరించింది. తమ ఉద్దేశం నిర్మాణ పనులు చేపట్టవద్దని తప్ప టెండర్లు, పాలనాపరమైన అంశాల నిలిపివేత కాదని పేర్కొంది. చెన్నై జోనల్‌ బెంచిలోని జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, ఎక్స్‌పర్ట్‌ మెంబర్‌ దాస్‌గుప్తాలు వీడియో సమావేశంలో ఏపీ ప్రభుత్వ వాదనను విన్నారు. తర్వాత ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. కేసు విచారణను ఆగస్టు 11కు వాయిదా వేశారు. తెలంగాణలోని నారాయణపేట జిల్లా బాపనపల్లికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిపివేయాలంటూ ఎన్‌జీటీని ఆశ్రయించారు.

  • వాళ్లది అనధికార ప్రాజెక్టు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనధికారికంగా చేపట్టిన ప్రాజెక్టు అని, దీనికి పర్యావరణ అనుమతి లభించలేదని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతలవల్ల ఆ ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లదని తెలిపింది. ‘పాలమూరు-రంగారెడ్డి’ని రిజర్వ్‌ ఫారెస్టులో నిర్మిస్తున్నారని, ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాల పరస్పరం అంగీకారం తెలిపిన వాటి జాబితాలో లేదంది. ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఈ మేరకు ఎన్‌జీటీలో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ప్రాజెక్టు వారీగా కేటాయింపులు, నిర్వహణ కార్యాచరణను రూపొందించే బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-2కు ఇచ్చిందని తెలిపింది.

ఇదే సమయంలో 2015 జూన్‌ 18-19 తేదీల్లో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందంలో ప్రాజెక్టుల వారీగా వినియోగం, నీటి వినియోగ నిర్వహణను కృష్ణా బోర్డు చూడాలని నిర్ణయం జరిగిందని, అయితే తెలంగాణ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా పర్యావరణ అనుమతి పొందకుండానే పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టిందని గ్రీన్‌ ట్రైబ్యునల్‌ దృష్టికి ఆంధ్రప్రదేశ్‌ తీసుకెళ్లింది. రెండు రాష్ట్రాలు ఎంత నీటిని వినియోగించుకోవాలన్న దానిపై 2020 మే 14న కృష్ణా బోర్డుకు లేఖ రాశామని, కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌ తమకు చేసిన కేటాయింపుల నుంచే వాడుకుంటామని బోర్డు దృష్టికి తెచ్చినట్లు వివరించింది. రెండు రాష్ట్రాల మధ్య 2015 జూన్‌లో జరిగిన ఒప్పందంలో రాయలసీమకు 144.70 టీఎంసీల నీటి కేటాయింపు ఉందని, పక్క బేసిన్‌కు నీటిని మళ్లిస్తున్నామనే వాదనలో అర్థం లేదంటూ, రాయలసీమకు కేటాయించిన నీటిలో 34 టీఎంసీలు శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాలువ ద్వారా వెళ్లాలని, ఇందులో 15 టీఎంసీలు చెన్నై తాగునీటి సరఫరాకు కలిసి ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది.

ఇవీ చూడండి...

బాధితులపైనే కేసులు బనాయించడం హేయం: చంద్రబాబు

Last Updated : Jul 14, 2020, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details