ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 27, 2021, 9:37 AM IST

ETV Bharat / state

మోపిదేవిలో.. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు ఎగరని జెండా!

దేశమంతటా 72 వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా చేసుకున్నారు. అయితే కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో మాత్రం.. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా ఆవిష్కరణ జరగలేదు. ఓ సెలవు మాదిరిగా.. అక్కడ జన సంచారమే లేదు.

పలు ప్రభుత్వ కార్యాలయాలపై ఎగరని జాతీయ జెండా
పలు ప్రభుత్వ కార్యాలయాలపై ఎగరని జాతీయ జెండా

దేశమంతటా 72 వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా చేసుకున్నా.. మోపిదేవిలో మాత్రం కొన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించలేదు. జాతీయ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్.. మరోవైపు.. పశు వైద్యాధికారి కార్యాలయం, వ్యవసాయ శాఖ కార్యాలయం, సివిల్ సప్లయ్ కార్యాలయం, వెలుగు కార్యాలయాలపై జాతీయ జెండా ఆవిష్కరణ చేయలేదు. అధికారుల జాతీయ భావం ఇదేనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details