ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన వారికి నియామక పత్రాలివ్వాలి' - లోకేశ్ వార్తలు తాజా

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నోటిఫికేషన్​లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తై మెరిట్ లిస్ట్​లో వున్న అభ్యర్థులకు పోస్టింగ్​లు ఇవ్వాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. దీనిపై అభ్యర్థులు, తెదేపా నేతలు నిరసన తెలుపుతుంటే వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

nara lokesh tweets
nara lokesh tweets

By

Published : Sep 1, 2020, 5:29 PM IST

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నోటిఫికేషన్​లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తై మెరిట్ లిస్ట్​లో వున్న అభ్యర్థులకు పోస్టింగ్​లు ఇవ్వాలని సీఎంకు లేఖ రాయడంతో పాటు.. అనేకసార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం స్పందించలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ విమర్శించారు.

ఈ రోజు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా విజయవాడలో ఆందోళన చేపట్టిన అభ్యర్థులను, మద్దతు తెలిపిన తెదేపా, ఏఐటీయూసీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చెయ్యడాన్నిలోకేశ్ తీవ్రంగా ఖండించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన వారికి వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:ఎల్​ఓసీ వెంబడి భారీ స్థాయిలో ఆయుధాలు పట్టివేత

ABOUT THE AUTHOR

...view details