తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు తెలిపారు. రెండు రోజుల నుంచి నీరసంగా ఉండటం వల్ల పరీక్షలు చేయించుకోగా..పాజిటివ్గా నిర్ధరణ అయిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకుని, హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు.
నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుకు కరోనా - నందిగామ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావుకు కరోనా
నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావుకు కరోనా పాటిజివ్ నిర్ధరణ అయింది. గత నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకుని, హోం క్వారంటైన్లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.
![నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుకు కరోనా nandigama mla jagan mohan rao affected by covid -19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8881272-178-8881272-1600682650332.jpg)
నందిగామ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావుకు కరోనా
ప్రజలందరి ఆశీస్సులతో త్వరలోనే కోలుకొని ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. చికిత్స తీసుకుంటున్నందున 14 రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరూ ఫోన్ చేయడం, కలవడానికి ప్రయత్నించవద్దని కోరారు.
ఇదీ చూడండి:రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ అక్టోబర్ 5కి వాయిదా