ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 30, 2020, 12:27 PM IST

Updated : Oct 30, 2020, 6:11 PM IST

ETV Bharat / state

మరదలితో సాన్నిహిత్యం..భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

Murder attempt on Machilipatnam Market yard chairman son
వైకాపా నేత కుమారుడిపై హత్యాయత్నం

12:24 October 30

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖాదర్​బాషా

మరదలితో సాన్నిహిత్యం..భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

భర్తపై భార్యే హత్యాయత్నం చేసిన ఘటన కృష్ణా జిల్లా ఇనగుదురుపేటలో చోటు చేసుకుంది. మచిలీపట్టణం మార్కెట్ యార్డు కమిటీ ఛైర్మన్,  వైకాపా నేత అచ్చాబా కుమారుడు ఖాదర్ బాషాపై హత్యాహత్నం జరిగింది. భార్య నజియానే ఆ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. మరదలితో ఖాదర్​బాషా సన్నిహితంగా ఉంటున్నాడంటూ..గతంలో గొడవలూ జరిగాయి. అదే కోపంతో ఈరోజు ఇంట్లో ఉన్న ఖాదర్​పై నజియా పెట్రోల్ పోసి నిప్పంటించింది. తీవ్రగాయాలపాలైన ఖాదర్‌ను కుటుంబసభ్యులు విజయవాడ ఆసుపత్రికి తరలించారు. 

ఇదీ చదవండి:పెళ్లి వేడుకకు హాజరై.. పరలోకానికి చేరి..

Last Updated : Oct 30, 2020, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details