కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో తెదేపా తరపున ఎంపీటీసీగా గంటా పార్వతి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక వైకాపా నేతలు తనను భయాందోళనకు గురి చేసి బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించారని ఆమె ఆరోపించారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని కలెక్టర్ ఇంతియాజ్ను కలిసి వివరించారు. వైకాపా నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆమె కలెక్టర్కు తెలిపారు. తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
'వైకాపా నాయకులు బెదిరించి నామినేషన్ విత్డ్రా చేయించారు' - unguturu latest news
ఎంపీటీసీగా నామినేషన్గా దాఖలు చేసిన తనను వైకాపా నాయకులు బెదిరించి విత్డ్రా చేయించారని గంటా పార్వతి అనే అభ్యర్థి ఆరోపించింది. వైకాపా నేతల నుంచి ప్రాణహాని ఉందని కలెక్టర్ ఇంతియాజ్ను కలిసి విన్నవించుకుంది.
!['వైకాపా నాయకులు బెదిరించి నామినేషన్ విత్డ్రా చేయించారు' nnnn](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10706811-451-10706811-1613823834067.jpg)
'వైకాపా నాయకులు బెదిరించి నామినేషన్ విత్డ్రా చేయించారు'