ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 16, 2021, 11:05 AM IST

ETV Bharat / state

'వైకాపా పాలనలో విజయవాడ నేర సామ్రాజ్యంగా మారింది'

విజయవాడ శివార్లలోని పలు ప్రాంతాల్లో ఎంపీ కేశినేని నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా పాలనలో నగరంలో నేరాలు పెరిగిపోయాయని ఆరోపించారు.

mp keshineni nani conduc election campaign in vijayawada
ఎంపీ కేశినేని నాని

వైకాపా పాలనలో విజయవాడ నేర సామ్రాజ్యంగా మారిందని స్థానిక ఎంపీ కేశినేని నాని విమర్శించారు. నగర శివారు భవానిపురం ప్రాంతంలోని పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఎంపీ... రాబోయే రోజుల్లో వైకాపా ప్రభుత్వం ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, ఫీజులు పెంచే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details